లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపారులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. ఎమ్మార్పీకే సరుకులు విక్రయించాలని స్పష్టం చేసింది. నూనె, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించినా.. ఎక్కువ ధరలకు విక్రయించినట్లు ఫిర్యాదులు అందినా.. సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయదేవి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పెట్రోలు బంకులు పని చేస్తాయని, నగరంలో వంట గ్యాస్ పంపిణీలో ఎలాంటి లోటు పాట్లు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. బంకుల్లో అక్రమాలను గుర్తించేందుకు నగరంలో తొమ్మిది టాస్క్ఫోర్స్ బృందాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఈ బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తాయని, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే వెంటనే చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. నిత్యావసర వస్తువులు, వంట నూనెలను బ్లాక్ మార్కెట్కు తరలించడం, అధిక ధరలకు విక్రయించడం వంటివి చేస్తే.. వినియోగదారులు 040-23447770 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే సుమారు 5.80 లక్షల కార్డుదారులకు బియ్యం పంపిణీ కోసం ఉదయం 6 నుంచి 10 వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయదేవి వెల్లడించారు.