హైదరాబాద్, ఆట ప్రతినిధి : బంతితో అర్ఫాజ్ అహ్మద్ (3/39), విజృంభణకు తోడు బ్యాట్తో బుద్ధి రాహుల్ (68 నాటౌట్) మెరవడంతో టీజీ 20 లీగ్లో నల్లగొండ నైట్స్ మూడో విజయాన్ని నమోదుచేసింది. సోమవారం ఆ జట్టు పాలమూరు స్ట్రైకర్స్ను 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అర్ఫాజ్తో పాటు నిషాంత్ (2/16) కట్టడిచేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన పాలమూరు 20 ఓవర్లకు 148/9కే పరిమితమైంది.
స్వల్ప ఛేదనలో రాహుల్.. బౌండరీలు, సిక్స్లతో విరుచుకుపడి నల్లగొండకు భారీ విజయాన్ని అందించాడు. మరో పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్.. ఖమ్మంపై 56 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో నాలుగో విజయాన్ని అందుకుంది. తొలుత హైదరాబాద్ 211/9 పరుగుల భారీ స్కోరు చేయగా ఛేదనలో ఖమ్మం 155/9 మాత్రమే చేయగల్గింది.