బర్మింగ్హాం: కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్లో భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర లిఖించారు. బుధవారం హైజంప్లో తేజస్విన్ శంకర్ కాంస్యం గెలిస్తే.. గురువారం లాంగ్జంప్లో మురశీ శ్రీశంకర్ రజతం సొంతం చేసుకున్నాడు. దీంతో CWGలో ఈ రెండు విభాగాల్లో భారత్కు పతకాలు సాధించిన అథ్లెట్స్గా రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన లాంగ్జంప్ ఫైనల్స్లో కేరళ యువకుడు మురళీ శ్రీశంకర్.. ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. ఇక బహమాస్కు చెందిన లకాన్ నైర్న్ స్వర్ణం గెలుచుకున్నాడు.
అయితే లకాన్ కూడా 8.08 మీటర్లే దూకినప్పటికీ.. అతని సెకండ్ బెస్ట్ అటెమ్ట్ (7.98 మీటర్లు) శ్రీశంకర్ (7.84 మీటర్లు) కంటే మెరుగ్గా ఉండడంతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల లాంగ్జంప్ విభాగంలో భారత్కు పతకం సాధించిన రెండో ఆటగాడిగా శ్రీశంకర్ నిలిచాడు. 1978లో కెనడాలో జరిగిన CWGలో సురేశ్ కాంస్యం గెలుపొందాడు. ఆ తర్వాత లాంగ్జంప్లో ఇండియాకు కామన్వెల్త్ పతకం లభించడం ఇదే మొదటిసారి.
SOARING HIGH 🤩🤩
🥈 #SreeshankarMurali after the historic feat at #CommonwealthGames in Men's Long Jump 😍😍#Cheer4India #India4CWG2022 pic.twitter.com/BdPt80MQwo
— SAI Media (@Media_SAI) August 4, 2022