ముంబై: ముంబై క్రికెట్ అసోసియేషన్.. గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నది. వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో క్రికెట్ బంతులతో .. 50 ఏళ్ల వార్సికోత్సవాన్ని జరుపుకున్నది. స్టేడియంలో 14,505 బంతులతో.. ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ వాంఖడే స్టేడియం అని రాసింది. దీని కోసం ఎరుపు, తెలుపు బంతుల్ని వాడింది. 1975లో వెస్టిండీస్తో వాంఖడే స్టేడియంలో తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది.14 వేల క్రికెట్ బంతులతో 50 ఏళ్ల వార్షికం సందర్భంగా ప్రదర్శన ఇచ్చారు. ఎంసీఏ ప్రెసిడెండ్ అజింక్య నాయక్ దీనిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మాజీ ప్లేయర్ ఏకనాథ్ సోల్కర్తో పాటు మాజీ ముంబై ఆటగాళ్ల స్మారకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. 1975లో జరిగిన మ్యాచ్లో సోల్కర్ సెంచరీ నమోదు చేశాడు. ఆ ఏడాది జనవరి 23 నుంచి 29 వరకు ఆ మ్యాచ్ జరిగింది. స్కూళ్లు, క్లబ్లు, ఎన్జీవోలకు చెందిన యువ క్రికెటర్లకు ఆ బంతుల్ని కానుకగా ఇవ్వనున్నట్లు ఎంసీఏ ప్రెసిడెంట్ తెలిపారు.