కొలంబో: ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ (Mujeeb Ur Rahman) వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో పాకిస్థాన్తో జరిగిన ఆఖరి, మూడో వన్డే మ్యాచ్లో రెహ్మాన్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 26 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టాడు. దాంతో గతంలో ఆఫ్ఘనిస్థాన్కే చెందిన స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉన్నది. రషీద్ ఖాన్ గతంలో ఐర్లాండ్తో జరిగిన ఓ వన్డే మ్యాచ్లో కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పుడు మరో బంతి ముందుగానే ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెహ్మాన్ ఆ ఫీట్ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కాగా, ఆఖరి వన్డేలోనూ ఓటమితో ఆఫ్ఘన్ టీమ్ పాకిస్థాన్కు 3-0 తేడాతో సిరీస్ను కోల్పోయింది.