న్యూఢిల్లీ: చెన్నై సూపర్కింగ్స్కు ఐదో టైటిల్ అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి శస్త్రచికిత్స విజయవంతమైంది. మోకాలి గాయంతోనే టోర్నీ ఆడిన ధోనీకి గురువారం ముంబైలోని దవాఖానలో జరిగిన సర్జరీ విజయవంతమైనట్లు చెన్నై సీఈవో విశ్వనాథన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.
ప్రముఖ అర్థోపెడిక్ సర్జన్ దిన్శా పర్యవేక్షణలో ధోనీకి శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలిపాడు. అయితే ధోనీ డిశ్చార్జ్ అయిన తర్వాత రాంచీకి వెళ్లినట్లు తెలిసింది.