MS Dhoni | ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నది. ఆ జట్టు కెపెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ధోనీ ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి చెన్నై సూపరింగ్స్ జట్టుకు కెప్టెన్గా కొనసాగుతూ వస్తున్నాడు.
2013 స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్ చేసిన మినహా మిగతా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్ సేవలందించాడు. 2022 సీజన్ ప్రారంభంలో రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించగా.. ఎనిమిది మ్యాచ్ల అనంతరం ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. ఐపీఎల్ చెన్నై సట్టుకు 212 మ్యాచ్లకు నాయకత్వం వహించగా.. 128 మ్యాచ్లు గెలిచి.. 82 మ్యాచుల్లో ఓటమిపాలైంది.
గత ఏడాది అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ధోనీ నేతృత్వంలోని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదోసారి టైటిల్ను సాధించిపెట్టాడు. ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. మిస్టర్ కూల్ తన కెరీర్లో 2007లో టీ20 వరల్డ్ కప్ టైటిల్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు.