ఒకప్పుడు చివరి ఓవర్లో 30 పరుగులు కావాలన్నా.. క్రీజులో ధోనీ ఉంటే అదో ధైర్యం. ఎందుకంటే ప్రపంచ అత్యుత్తమ ఫినిషర్ అయిన ధోనీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా జట్టును గెలిపిస్తాడనే నమ్మకం. ఐపీఎల్లో చెన్నై అభిమానులు కూడా ఇదే నమ్ముతారు. అయితే గత రెండు ఐపీఎల్ సీజన్లు చూస్తే మాత్రం లెక్కలు ధోనీ ఫ్యాన్స్ దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.
2020 ఐపీఎల్ టోర్నీ మొత్తం ఆడిన ధోనీ కేవలం 200 పరుగులు మాత్రమే చేశాడు. ఇక గతేడాది అయితే మరింత ఘోరంగా 114 పరుగులే చేశాడు. గతేడాది ప్లేఆఫ్స్లో ఢిల్లీపై 6 బంతుల్లోనే 13 పరుగులు చేసిన ధోనీ.. మళ్లీ తన ఫినిషర్ రోజులకు వెళ్తున్నాననే ఆశలు కల్పించాడు. అయితే మాజీ ఆల్రౌండర్ రీతేందర్ సోధి మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు.
దోనీ ఒకప్పటి ఆటగాడు కాదని, కాబట్టి పదో ఓవర్ తర్వాత క్రీజులోకి వచ్చేలా ప్లాన్ చేసుకుంటే మంచిదని సోధి అన్నాడు. నెమ్మదిగా నిలదొక్కుకొని, చివర్లో కావాలంటే తన ఫైర్వర్క్స్ చూపించొచ్చు అని అభిప్రాయపడ్డాడు. అలాగే శ్రీలంకపై టెస్టుల్లో అద్భుతంగా రాణించిన జడేజా కూడా ఈసారి చెన్నై జట్టుకు కీలకం కానున్నాడని.. ధోనీ, జడ్డూ ఇద్దరూ రాణిస్తే చెన్నై కచ్చితంగా ఫైనల్ చేరుతుందని పేర్కొన్నాడు.