లక్నో: మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్నాడు. తన అసమాన ఆటతో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో 7 వికెట్లు పడగొట్టి ప్రపంచకప్ వేటకు రాచబాటవేశాడు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని షమీ సొంత గ్రామంలో మినీ స్టేడియం (Mini-stadium), జిమ్ నిర్మించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అమ్రోహా (Amroha) జిల్లా కలెక్టర్ రాజేశ్ త్యాగీ (Rajesh Tyagi) ఓ ప్రకటన చేశారు.
షమీ సొంతూరైన సాహస్పూర్ అలీనగర్లో (Sahaspur Alinagar) మినీ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. స్టేడియంతోపాటు జిమ్ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వాటికోసం గ్రామంలో తగినంత స్థలం ఉందన్నారు. రాష్ట్రంలో 20 మినీ స్టేడియాలు నిర్మించడనాకిఇ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, వీటిలో అమ్రోహ జిల్లా కూడా ఉందన్నారు. అయితే దేశవాళీ క్రికెట్లో షమీ బెంగాల్ జట్టు తరఫుణ ఆడుతుండటం విశేషం.