Mohammed Shami | న్యూఢిల్లీ: భారత స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరఫున పశ్చిమబెంగాల్లో పోటీ చేసే చాన్స్ ఉంది. కుడికాలి చీలమండ గాయానికి ప్రస్తుతం శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న షమీని బీజేపీ ఇటీవల సంప్రదించినట్లు తెలిసింది.
బెంగాలోని బసిర్హత్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ పెద్దలు షమీ వైపు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల తీవ్ర దుమారం రేపిన సందేశ్ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే. ఇదిలా ఉంటే షమీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడ్డ షమీ..గాయంతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్తో పాటు ఐపీఎల్కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.