న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర అవార్డుకు భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టిని కేంద్ర క్రీడాశాఖ సిఫారసు చేసింది. అంతర్జాతీయ టోర్నీల్లో సాత్విక్, చిరాగ్ జంట అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నది. ప్రతిష్ఠాత్మక టోర్నీలైన ఆసియాగేమ్స్, కామన్వెల్త్, ప్రపంచ చాంపియన్షిప్, థామస్ కప్, ఏషియన్ చాంపియన్షిప్లో చిరాగ్తో కలిసి ఆంధ్రప్రదేశ్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ టైటిళ్లు కొల్లగొట్టాడు.
ఈ క్రమంలో బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లోనూ నంబర్వన్ ర్యాంక్ దక్కించుకుని కొత్త చరిత్ర లిఖించారు. మరోవైపు తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా చాంపియన్షిప్లో కాంస్యాలతో పాటు ప్రపంచ చాంపియన్షిప్(2023)లోనూ హుసామ్ సత్తాచాటాడు. ఇటీవల స్వదేశం వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్లో 24 వికెట్లతో అదరగొట్టిన టీమ్ఇండియా స్పీడ్స్టర్ మహమ్మద్ షమీని పేరును అర్జున అవార్డు కోసం ప్రతిపాదించారు. మెగాటోర్నీలో భారత్ను ఫైనల్ చేర్చడంలో షమీ కీలకంగా వ్యవహరించాడు. వీరికి తోడు మొత్తం 16 మంది అర్జున అవార్డు సిఫారసు జాబితాలో ఉన్నారు. ధ్యాన్చంద్ లైఫ్టైమ్ అవార్డు కోసం కవిత, మంజుషా కన్వర్, వినీత్కుమార్ పోటీపడుతున్నారు.