ధర్మశాల: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయానికి ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న షమీ..సెప్టెంబర్లో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా సోమవారం పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ సందర్భంగా షమీ గాయపడ్డ సంగతి తెలిసిందే.