Pro Kabaddi | ముంబై: ప్రో కబడ్డీ లీగ్ 10 సీజన్ వేలంలో ఇరాన్కు చెందిన మొహమ్మద్రెజా షాద్లూయీ చియానేహ్ రికార్డు ధర పలికాడు. సోమవారం ముంబైలో జరిగిన వేలంలో రైడర్, డిఫెండర్ అయిన షాద్లూయూని పుణేరి పల్టన్ రూ.2.35 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో, పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఇరానీయన్ నిలిచాడు. ఈమధ్యే ముగిసిన ఆసియా క్రీడల్లో ఇరాన్ కెప్టెన్గా షాద్లూయీ అదరగొట్టాడు.
దాంతో, అతడి కోసం యూ ముంబా, గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ పోటీ పడ్డాయి. చివరకు పుణేరి పల్టన్ కళ్లు చెదిరే ధరతో ఈ ఇరాన్ కెప్టెన్ను సొంతం చేసుకుంది. ఇక.. భారత స్టార్ మనీందర్ సింగ్ను రూ. 2.12 కోట్లకు బెంగాల్ వారియర్స్ దక్కించుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియలో 12 జట్లు పాల్గొన్నాయి. సోమవారం గ్రూప్ ఏ, బి ఆటగాళ్లు వేలం జరగగా.. మంగళవారం గ్రూప్ సీ, గ్రూప్ డీ ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.