మెల్బోర్న్: అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో వెయ్యి పరుగుల మైలురాయిని దాటిన 8వ ఇంగ్లండ్ క్రికెటర్గా మొయిన్ అలీ(Moeen Ali) నిలిచాడు. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆ ఘనతను మొయిన్ అలీ అందుకున్నాడు. ఇది అలీకి 67వ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఓడింది. కానీ 12 బంతుల్లో 24 రన్స్ చేశాడు అలీ. ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేసే అలీ ఖాతాలో 40 టీ20 వికెట్లు కూడా ఉన్నాయి.
2014లో మొయిన్ అలీ టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. వెయ్యి పరుగులు, 40 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్గా నిలిచాడతను. టీ20ల్లో మొత్తం 1019 రన్స్ స్కోర్ చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 23.69. ఇక స్ట్రయిక్ రేట్ 147.25గా ఉంది.
మొయిన్ అలీ ఇప్పటి వరకు 259 టీ20 మ్యాచ్లు ఆడాడు. అంతా కలిపి అతను 5576 రన్స్ చేశాడు. స్ట్రయిక్ రేటు 142.49గా ఉంది. అతని ఖాతాలో 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 175 వికెట్లు తీసుకున్నాడు.
ఈ ఏడాది మొయిన్ అలీ దూకుడుగా ఆడుతున్నాడు. 23 టీ20ల్లో అతను 490 రన్స్ చేశాడు. స్ట్రయిక్ రేటు 162.79గా ఉంది. ఈ ఏడాదే అతను నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.