Moeen Ali : ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు. టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. అవును.. త్వరలో సొంత గడ్డపై జరగనున్న యాషెస్ సిరీస్(Ashes Series)లో అతను ఆడనున్నాడు. ప్రస్తుతం పరిమిత ఓవర్లలో ఆడుతున్న అలీకి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) నుంచి పిలుపు వచ్చింది. దాంతో, కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, ఈసీబీ పురుషుల జట్టు మేనేజింగ్ డైరెక్టర్తో చర్చించిన అనంతరం ఈ ఆల్రౌండర్ టెస్టులు ఆడేందుకు ఓకే చెప్పాడు.
‘ఈ వారం మొదట్లో మేము అలీని సంప్రదించాం. మళ్లీ టెస్టులు ఆడే ఉద్దేశం ఉందా? లేదా? అని అడిగాం. రెండు రోజుల తర్వాత అతను ఓకే చెప్పాడు. దాంతో, యాషెస్ సిరీస్తో అలీ మళ్లీ టెస్టుల్లో ఆడనున్నాడు. అతని సుదీర్ఘ అనుభవం, ఆల్రౌండ్ నైపుణ్యం జట్టుకు ఎంతో లాభం చేస్తుంది’ అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలు కానుంది. ఆసీస్, ఇంగ్లండ్ 5 టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి.
అలీ 2014లో టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. అతను 2021లో ఆఖరి టెస్టు ఓవల్ స్టేడియంలో భారత్పై ఆడాడు. 64 టెస్టుల్లో అలీ 2,914 రన్స్ కొట్టాడు. 195 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అలీ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాడు. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై గెలిచిన సీఎస్కే ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకుంది.