IND vs AUS : తొలి వన్డేలో రాణించిన ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఎనిమిదో ఓవర్లో మూడు సిక్స్లు బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడిన మార్ష్ 29 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్స్లతో యాభైకి చేరువయ్యాడు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్(54), ట్రావిస్ హెడ్ (36) శుభారంభం ఇచ్చారు. షమీ, సిరాజ్ బౌలింగ్లో ఫోర్లు కొడుతూ స్కోర్బోర్డును పరుగులు పెట్టించారు. వీళ్లిద్దరు తొలి వికెట్కు 94 పరుగులు జోడించారు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 117 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో చెలరేగడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. 26వ ఓవర్ వేసిన స్టార్క్ ఆఖరి బంతికి సిరాజ్ను బౌల్డ్ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ఓవర్లో సియాన్ అబాట్ రెండు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ (4), మహమ్మద్ షమీ(0)ని ఔట్ చేశాడు. దాంతో, 103 రన్స్ వద్ద భారత్ తొమ్మిదో వికెట్ పడింది. ఆసీస్ బౌలర్లలో సియాన్ అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీశారు.