సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్, ఆ జట్టుకే చెందిన మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్(Mitchell Johnson) మధ్య ప్రస్తుతం వివాదం చెలరేగుతోంది. పాకిస్థాన్ సిరీస్కు ఎంపికైన డేవిడ్ వార్నర్ గురించి జాన్సన్ అనుచిత కామెంట్ చేయడంతో అతన్ని కామెంట్రీ బృందం నుంచి తీసివేశారు. పెద్దగా ఫామ్లో లేకున్న వార్నర్ను పాక్ సిరీస్కు ఎంపిక చేశారని, ఎందుకంటే అతను ఈ సిరీస్ తర్వాత రిటైర్ కానున్నట్లు జాన్సన్ ఓ వ్యాసంలో రాశారు. దీంతో ఆ ఇద్దరి మధ్య వైరం ఉన్నట్లు తేలింది.
చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ కూడా ఆటగాళ్లతో అతి సన్నిహితంగా ఉంటున్నాడని, సెలెక్షన్ విధానంగా సరిగా లేదని కూడా జాన్సన్ ఆరోపించాడు. అయితే పాక్ సిరీస్కు ట్రిపుల్ ఎం కామెంటరీ బృందంలో ఉండనున్నట్లు తొలుత జాన్సన్ చెప్పినా.. కానీ కామెంటేటర్ల బృందం లిస్టులో అతని పేరును చేర్చలేదు. అక్రమ్, టేలర్, హ్యూగ్స్ మాత్రమే కామెంటరీ లిస్టులో ఉన్నారు.
వార్నర్తో వివాదం వల్లే తనను కామెంట్రీ బృందం నుంచి తీసివేసినట్లు జాన్సన్ చెప్పాడు.