హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఖేలో ఇండియా మహిళలజూడోసౌత్ లీగ్ టోర్నీలో పతకాలు సాధించిన.. అదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సోమవారం క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తన కార్యాలయంలో అభినందించారు. కేరళ తిరుచూరు వేదికగా జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు చెందిన జూడోకాస్ సునీత (40 కేజీలు), చాందిని (57 కేజీలు), శ్రీజ (57 కేజీలు) స్వర్ణ పతకాలు సాధించగా.. రమ్య రజతం, లిపిస్కా, మధులత కాంస్య పతకాలు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, ధనలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.