హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల ముగిసిన ఆసియా సైక్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన యువ సైక్లిస్ట్ ఆశిర్వాద్ సక్సేనాను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఆశీర్వాద్ను సన్మానించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ఊరూరా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నాం. అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్పోర్ట్స్ స్టేడియంలను అందుబాటులోకి తేనున్నాం. అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తున్న తెలంగాణ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశీర్వాద్ తల్లిదండ్రులు కీర్తి, అనురాగ్ సక్సేనా పాల్గొన్నారు.