శాన్ఫ్రాన్సిస్కో: ప్రతిష్ఠాత్మక నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో గోల్డెన్స్టేట్ వారియర్స్ విజేతగా నిలిచింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో గోల్డెన్ స్టేట్ వారియర్స్ 103-90 (4-2) తేడాతో బోస్టన్ సెల్టిక్స్పై అద్భుత విజయం సాధించింది. మొత్తం నాలుగు సెట్ల పాటు జరిగిన తుది పోరులో ఇరు జట్లు ప్రతీ పాయింట్ కోసం నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. కిక్కిరిసిన స్టేడియంలో ప్రేక్షకుల మధ్య లీగ్లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ ప్రదర్శన లీగ్కే హైలెట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో కర్రీ 34 పాయింట్లతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. గత ఏడేండ్లలో నాలుగోసారి విజేతగా నిలిచిన గోల్డెన్స్టేట్ వారియర్స్ జట్టును రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రత్యేకంగా అభినందించారు. ‘ఎన్బీఏ చాంపియన్స్గా నిలిచిన వారియర్స్ టీమ్తో పాటు స్టార్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీకి కంగ్రాట్స్. టేక్ ఏ బో కర్రీ’ అని ట్వీట్ చేశారు.