బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జ్యోతి వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మల్లయ్యయాదవ్, రాష్ట్ర బాస్కెల్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో మహబూబ్నగర్పై హైదరాబాద్, మహబూబాబాద్పై నల్లగొండ, కరీంనగర్పై ములుగు, హనుమకొండపై వికారాబాద్ గెలిచాయి.