హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ కోటా కింద బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించిన నిఖత్.. సోమవారం శ్రీనివాస్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘నిజామాబాద్ జిల్లా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన నిఖత్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రాష్ర్టానికి, దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకువస్తున్న నిఖత్కు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అభినందనీయం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, హరికృష్ణలు పాల్గొన్నారు.