సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్నిరంగాల్లో రాణించి ముంబై ఇండియన్స్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరకు మూడు పరుగుల తేడాతో ముంబైను ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్.. రాహుల్ త్రిపాఠీ (76), ప్రియమ్ గార్గ్ (42), పూరన్ (38) రాణించడంతో 193 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబైకి రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43) శుభారంభం అందించారు.
అయితే వాళ్లు అందించిన ఆరంభాన్ని మిడిలార్డర్ ఉపయోగించుకోలేకపోయింది. డానియల్ శామ్స్ (15), తిలక్ వర్మ (8), ట్రిస్టన్ స్టబ్స్ (2) విఫలమయ్యారు. చివర్లో టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46) ముంబైని గెలిపించేలా కనిపించాడు. కానీ అతను రనౌట్ అవడంతో సన్రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. రమణ్దీప్ సింగ్ (6 బంతుల్లో 14 నాటౌట్) క్రీజులో ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాడు.
దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం మూడు పరుగుల తేడాతో సన్రైజర్స్ చేతిలో ఓడింది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు.