ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న సన్రైజర్స్ మరో వికెట్ కోల్పోయింది. ప్రియమ్ గార్గ్ (42) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (38) అవుటయ్యాడు. భారీ షాట్లతో అలరించిన పూరన్ను మెరెడిత్ పెవిలియన్ చేర్చాడు. మెరెడిత్ వేసిన బంతిని డీప్ బ్యాక్వర్డ్ దిశగా గాల్లోకి లేపాడు పూరన్.
అయితే అక్కడకు పరిగెడుతూ వచ్చిన మార్కండే డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అతని చేతుల్లో పడిన బంతి కింద పడినప్పటికీ.. అప్పటికే దాని కింద మార్కండే వేళ్లు చేరినట్లు రిప్లేలో కనిపించింది. దీంతో పూరన్ పెవిలియన్ చేరాడు.
తర్వాత కాసేపటికే రమణ్దీప్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠీ (76) కూడా పెవిలియన్ చేరాడు. సింగ్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా బాదేందుకు ప్రయత్నించిన త్రిపాఠీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. దాంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మకు సలుభమైన క్యాచ్ ఇచ్చాడు.