MI vs RCB : మోస్తరు టార్గెట్ 156తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ యస్తికా భాటియా (23) వికెట్ కోల్పోయింది. ప్రీతి బోస్ వేసిన ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో, 45 పరుగలు వద్ద ఆ జట్టు తొలి వికెట్ పడింది. నాట్ సీవర్ బ్రంట్ క్రీజులోకి వచ్చింది. మరో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (23)తో కలిసి బౌండరీలు కొడుతూ స్కోర్బోర్డు పరుగులు పెట్టించింది. వీళ్లు గ్యాప్స్లో ఫోర్లు కొడుతూ చెలరేగారు.
మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 155కు ఆలౌట్ అయింది. మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఆ జట్టు కుప్పకూలింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకదశలో ఆ జట్టు 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో అనిపించింది. అయితే.. రీచా ఘోష్ (28) కనికా ఆహుజా (22), శ్రేయాంక్ పాటిల్ (23), మంధాన (23) ఆ జట్టును ఆదుకున్నారు.