ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్.. ముంబైకి తొలి బ్రేక్ ఇచ్చాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ (16)ను పెవిలియన్ చేర్చాడు. 9వ ఓవర్లో బంతి అందుకున్న ఉనద్కత్ వేసిన బంతిని లాంగాన్లో సిక్సర్ కొట్టడానికి డుప్లెసిస్ ప్రయత్నించాడు.
కానీ సరిగా టైమింగ్ సరిగా కుదరకపోవడంతో అది బౌండరీలైన్ వరకు వెళ్లలేదు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్కు సులభమైన క్యాచ్ వెళ్లింది. దాన్ని అతను అందుకోవడంతో డుప్లెసిస్ మైదానం వీడాడు. 50 పరుగుల వద్ద బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది.