ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోనే ఉంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ను ఢీకొట్టేందుకు రోహిత్ సేన రెడీ అయింది. పంజాబ్పై ముంబై కనుక నిజంగా గెలవాలని అనుకుంటే చాలా ఎగ్రెసివ్ అప్రోచ్తో ఆడాలని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం గ్రేమ్ స్వాన్ అన్నాడు.
బెంగళూరుపై చెన్నై ఎలాగైతే ఎగ్రెసివ్గా ఆడిందో, అలాగే ముంబై కూడా ఎగ్రెసివ్గా ఆడితేనే విజయం నమోదు చేస్తుందని చెప్పాడు. అప్పుడే ముంబై తలరాత మారుతుందని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ ముంబై జట్టు ఓటమిపాలైంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో బలహీనత ముంబై జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ను ఓడించడానికి రోహిత్ ఏం చేస్తాడో చూడాలి.