ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించినా కూడా.. ముంబై స్కోరు బోర్డు ముందుకు వెళ్లడం కష్టంగా సాగింది.
అయితే సూర్యకుమార్ యాదవ్కు జతగా తిలక్ వర్మ (38 నాటౌట్) కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై జట్టు పోరాడగలిగే స్కోరు చేసింది. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చివరి ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని ఆడబోయాడు. కానీ అది మిస్ అయ్యి కీపర్ చేతుల్లో పడింది. ఈ క్రమంలో కాట్ బిహైండ్ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ నిరాకరించాడు.
శ్రేయాస్ అయ్యర్ రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి బ్యాటును తాకినట్లు తేలడంతో సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. చివర్లో కీరన్ పొలార్డ్ (5 బంతుల్లో 22 నాటౌట్) కూడా బ్యాటు ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కోల్కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసుకున్నారు.
Paltan, maja aali na?🔥
Onto our bowlers now, let's defend this! 👊#OneFamily #DilKholKe #MumbaiIndians #KKRvMI pic.twitter.com/QinV4k9OIP
— Mumbai Indians (@mipaltan) April 6, 2022