ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ కోల్పోయింది. మరోసారి కుమార్ కార్తికేయ సత్తా చాటాడు. అంతకుముందు ధాటిగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ (43)ను పెవిలియన్ చేర్చిన అతను.. మరో ఓపెనర్ రహానే (25)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
కార్తికేయ వేసిన బంతిని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించిన రహానే.. పూర్తిగా బంతిని మిస్ అయ్యాడు. దాంతో అది వికెట్లను కూల్చింది. దాంతో 87 పరుగుల వద్ద కోల్కతా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. దీంతో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.