ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. ఇప్పటికే అజింక్య రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10) వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయిన కేకేఆర్.. పదో ఓవర్లో కీపర్ శామ్ బిల్లింగ్స్ (17) వికెట్ కూడా కోల్పోయింది. మురుగన్ అశ్విన్ వేసిన బంతిని లాంగాఫ్ మీదుగా సిక్సర్ బాదేందుకు బిల్లింగ్స్ ప్రయత్నించాడు.
ముందుకొచ్చి భారీ షాట్ ఆడే క్రమంలో బ్యాట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో లాంగాఫ్లో బసిల్ థంపికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో బ్యాటును తలపై పెట్టుకొని మైదానం వీడాడు. ఈ వికెట్తో కేకేఆర్ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 67 పరుగుల స్కోరుతో నిలిచింది.