కోల్కతా నైట్ రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. ఐదు వికెట్లు తీసుకున్న అతను.. ప్రమాదకరంగా మారుతున్న నితీష్ రాణా (43)తోపాటు విండీస్ విధ్వంసకారుడు రస్సెల్ (9)ను కూడా పెవిలియన్ చేర్చాడు. దీంతో తర్వాత వచ్చిన ముంబై బ్యాటర్లు ఎవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు వెంకటేశ్ అయ్యర్ (43), రహానే (25) మంచి ఆరంభం అందించారు. తర్వాత రాణా ధాటిగా ఆడినా.. శ్రేయాస్ అయ్యర్ (6), రస్సెల్, షెల్డాన్ జాక్సన్ (5), ప్యాట్ కమిన్స్ (0), సునీల్ నరైన్ (0), టిమ్ సౌథీ (0) ఎవరూ రాణించలేదు. చివర్లో రింకూ సింగ్ (23 నాటౌట్) కొంత పోరాడిని కోల్కతాకు భారీ స్కోరు అందించలేకపోయాడు.
ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. కుమార్ కార్తికేయ 2 వికెట్లు తీసుకున్నాడు. మురుగన్ అశ్విన్, డానియల్ శామ్స్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి కోల్కతా జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది.