కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్మెన్ మరోసారి విఫలమయ్యారు. ఫామ్ లేమితో బాధపడుతున్న సూర్యకుమార్ యాదవ్ (౩౩) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచులో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (7), క్వింటన్ డీకాక్ (19), సౌరభ్ తివారీ (15), కీరన్ పొలార్డ్ (6) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు.
దీంతో ముంబై జట్టు 87 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా (3), కృనాల్ పాండ్యా క్రీజులో ఉన్నారు. వీరిపైనే ముంబై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ౩ వికెట్లతో చెలరేగగా నోర్ట్జీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.