ఖతర్లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో సౌదీ అరేబియా జట్టు సంచలనం సృష్టించింది. మంగళవారం లుసెయిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో సౌదీ అరేబియా 2-1 గోల్స్తో అర్జెంటీనాను ఓడించింది. 51వ ర్యాంక్లో ఉన్న సౌదీ అరేబియా మూడో ర్యాంక్లో ఉన్న అర్జెంటీనాను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభమైన 10వ నిమిషంలో మెస్సీ అర్జెంటీనా తరఫున తొలి గోల్ కొట్టాడు. ఫెనాల్టీ ద్వారా ఆ గోల్ సాధించాడు. 48వ నిమిషంలో సౌదీ అరేబియా ఫార్వర్డ్ ప్లేయర్ సలేహ్ అల్ షెహ్రీ తమ జట్టుకు మొదటి గోల్ అందించాడు. మిడ్ఫీల్డర్ సలీం అల్ దవ్సారీ 53వ నిమిషంలో రెండో గోల్ సాధించడంతో సౌదీ అరేబియా విజేతగా నిలిచింది.
ఫిఫా వరల్డ్కప్లోని పాపులర్ జట్లలో అర్జెంటీనా ఒకటి. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా, సౌదీ అరేబియాను చిత్తుగా ఓడిస్తుందని అనుకున్నారంతా. కానీ, సౌదీ అరేబియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేశారు. దాంతో, అర్జెంటీనా అభిమానులు షాక్లో ఉండిపోయారు.