హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో తెలంగాణ అథ్లెట్లు సత్తాచాటి.. రాష్ట్రం గర్వపడే విజయాలు సాధించారని సాట్స్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్లో తెలంగాణ ప్రతిభకు పతకాలు పాదాక్రాంతమయ్యాయని పేర్కొన్నారు. షూటింగ్లో ఇషా సింగ్, బాక్సింగ్లో నిఖత్ జరీన్, అథ్లెటిక్స్లో అగసర నందిని రాణించి.. యువతలో కొత్త ప్రేరణ నింపారని అన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందించిందని.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుందని సాట్స్ చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.