Matheesha Pathirana | చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఆ జట్టు పేసర్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన మతీశ పతిరాన గుడ్ న్యూస్ చెప్పాడు. గాయం కారణంగా చెన్నై – బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్కు దూరమైన పతిరాన.. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అతడి మేనేజర్ అమిలా కలుగలగె ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించాడు.
గత సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన పతిరాన.. 19 వికెట్లు తీసి సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు. అతడు త్వరలోనే చెన్నై టీమ్తో కలిసే అవకాశముంది.