Matheesha Pathirana : శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన(Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐదు ఏండ్లగా చెక్కు చెదరని రికార్డు బద్ధలు కొట్టాడు. అఫ్గనిస్థాన్తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లో పథిరన రెండు వికెట్లు తీసి.. ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్గా అవతరించాడు. దాంతో, యార్కర్ కింగ్ లసిత్ మలింగ(Lasith Malinga) పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అచ్చం మలింగ బౌలింగ్ యాక్షన్ను తలపించే పథిరన అఫ్గనిస్థాన్తో జరిగిన మూడు మ్యాచుల సిరీస్లో 8 వికెట్లు పడగొట్టాడు. దాంతో, మలింగ రెండో స్థానానికి పడిపోయాడు. 2019లో న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. 2002లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు.
లసిత్ మలింగ, పథిరన