Westindies : వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్(World Cup Qualifiers 2023)లో జింబాబ్వే(Zimbabwe) చేతిలో ఓటమిని మర్చిపోకముందే మాజీ చాంపియన్ వెస్టిండీస్(Westindies)కు మరో షాక్ తగలింది. జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో ఏకంగా 60 శాతం కోత విధించారు. విండీస్ కెప్టెన్ షై హోప్(Shai Hope) తమ పొరపాటును అంగీకరించాడు.
దాంతో, మ్యాచ్ రిఫరీ మహమ్మద్ జావెద్(Muhammad Javed) కరీబియన్ జట్టుకు జరిమానా విధించాల్సిందిగా ఐసీసీకి సూచించాడు. నిర్ణీత సమయానికి విండీస్ జట్టు 3 ఓవర్లు వెనకబడింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేటు కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టీండీస్కు జింబాబ్వే షాకిచ్చింది. 35 పరుగుల తేడాతో విండీస్ను ఓడించింది. ఆల్రౌండ్ సికిందర్ రజా((68 పరుగులు, 2 వికెట్లు) బ్యాటు, బంతితో చెలరేగాడు. టెండాయ్ చటరా మూడు వికెట్లతో విండీస్ను దెబ్బకొట్టాడు. దాంతో, కరీబియన్ జట్టుకు ఓటమి తప్పలేదు. మొదట బ్యాంటిగ్ చేసిన జింబాబ్వే 268 పరుగులు చేసింది.
విజయానందలో జింబాబ్వే ఆటగాళ్లు
సికిందర్ రజాతో పాటు, రియాన్ బర్ల్(50) హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే స్కోర్ అందించారు. లక్ష్య ఛేదనలో ఆది నుంచి తడబడింది. ఓపెనర్ కైలీ మేయర్స్(56) అర్ద శతకంతో విరుచుకుపడ్డాడు. రోస్టన్ చేజ్(44), కెప్టెన్ షై హోప్(30), నికోలస్ పూరన్(34) ధాటిగా ఆడినా జట్టను గెలిపించలేకపోరు. అయితే.. ఇప్పటికే విండీస్ సూపర్ సిక్స్కు క్వాలిఫై అయింది. కానీ, జింబాబ్వేపై ఓటమితో రెండు పాయింట్లు కోల్పోవడం తర్వాతి దశలో షై హోప్ సేనపై ప్రభావం చూపనుంది.