న్యూఢిల్లీ: భారత షూటర్ మనూ భాకర్కు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్లో .. ఈఫిల్ టవర్ లోగో(Eiffel Tower Logo) జతకూడింది. మనూ భాకర్ అకౌంట్కు వెరిఫైడ్ బ్లూ టిక్ కూడా ఉన్నది. పారిస్ ఒలింపిక్స్ 2024 షూటింగ్ ఈవెంట్లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆదివారం మనూ భాకర్ కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈఫిల్ టవర్ లోగో ఉందంటే.. ఆ అకౌంట్ హోల్డర్కు 2024 ఒలింపిక్స్లో మెడల్ వచ్చినట్లు సంకేతమన్నమాట.
ఇక ఇవాళ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లోనూ ఫైనల్లోకి ప్రవేశించింది. మనూ భాకర్, సరబ్జోత్ సింగ్ .. కాంస్య పతకం కోసం ఆడనున్నారు. రేపు ఆ ఫైనల్ ఈవెంట్ ఉంటుంది. ఒకవేళ మంగళవారం జరిగే ఫైనల్లో మనూ భాకర్ పతకాన్ని గెలిస్తే, అప్పుడు ఆమె కొత్త చరిత్ర లిఖించిన అథ్లెట్గా నిలుస్తుంది. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి క్రీడాకారిణిగా కీర్తిని ఆమె పొందనున్నది. 1990లో నార్మన్ ప్రిట్చార్డ్.. రెండు సిల్వర్ మెడల్స్ గెలిచారు. అయితే ఆ తర్వాత ఏ ఒక్క ఇండియన్ అథ్లెట్ కూడా ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించలేదు.
Winning this medal is a dream come true, not just for me but for everyone who has supported me. I am deeply grateful to the NRAI, SAI, Ministry of Youth Affairs & Sports, Coach Jaspal Rana sir, Haryana government and OGQ. I dedicate this victory to my country for their incredible… pic.twitter.com/hnzGjNwUhv
— Manu Bhaker🇮🇳 (@realmanubhaker) July 28, 2024