బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో ఆరో ర్యాంకర్, మూడు సార్లు ఆసియా కప్ ఛాంపియన్ అయిన జపాన్ క్రీడాకారిణి హినా హయత్పై గెలుపొందింది. కాంస్య పతకం సాధించి ఆసియన్ కప్ పోటీల్లో పతకం గెలిచిన మొదటి మహిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనికా రికార్డు క్రియేట్ చేసింది. మనికా, హినా హయత్ను 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2 పాయింట్లతో ఓడించింది.
క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ క్రీడాకారిణిని చెన్ జూ యుని చిత్తు చేసి, మనికా సెమీ ఫైనల్కి చేరింది. దాంతో, ఆసియాకప్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన మొదటి భారత క్రీడాకారిణిగా గుర్తింపు సాధించింది. సెమీఫైనల్లో నాలుగో సీడ్ మిమ ఇటో (జపాన్) చేతిలో మనికా ఓడిపోయింది. అయినా కూడా పట్టువిడవకుండా కాంస్య పతక పోరులో హినా హయత్పై విజయం సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్లో మనికా రెండు బంగారు పతకాలు గెలిచింది. ఈ టోర్నమెంట్లో మొత్తం నాలుగు మెడల్స్ సొంతం చేసుకుంది.