కౌలాలాంపూర్: భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు నయా సీజన్కు సిద్ధమయ్యారు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మలేషియా ఓపెన్లో బరిలోకి దిగనున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నీలో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల విభాగంలో గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా పోటీ పడుతున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీలో ఆడటం లేదు.