హైదరాబాద్ ఆట ప్రతినిధి: మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్డీసీఏ) స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 నిర్వహణకు రంగం సిద్ధమైంది. టీ20 ఫార్మాట్లో పోటీలు జరుగుతాయని.. గురువారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 7హెచ్ స్పోర్ట్స్ డెరెక్టర్ బి. వెంకటేశ్ ప్రకటించారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎంఎస్డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫైండేషన్ సహకారంతో ఈ లీగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
లీగ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదుగురు ప్లేయర్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ. 5 లక్షల విలువగల స్కాలర్షిప్ అందిస్తామని ప్రకటించారు. గురువారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. వచ్చే నెల 17 వరకు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్లో ఆగస్టు 27 నుంచి మ్యాచ్లు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మల్కా యశస్వి, రషీద్ బాషా, ప్రవీణ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.