మహబూబ్నగర్ టౌన్, జనవరి 10: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరిగిన ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అంతర్ సర్కిల్ విద్యుత్శాఖ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ ముగిసింది. మొత్తం 13 జట్లు టోర్నీలో పాల్గొనగా.. 160 మందికిపైగా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. లీగ్ మ్యాచ్లు రసవత్తరంగా జరగగా.. బుధవారం స్టేడియం మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
తుదిపోరులో ఖమ్మం 25-21, 25-18తో మహబూబ్నగర్పై ఉత్కంఠ విజయం సాధించింది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో హైదరాబాద్ 21-19, 23-18తో నల్లగొండపై గెలిచింది. విజేతలకు విద్యుత్శాఖ ఎస్ఈ శ్రీరామూర్తి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో శ్రీనివాస్, డీఈలు పాల్గొన్నారు.