హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ‘ఫిట్రైజ్ ఇండియా 75’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ట్రయల్ థాన్లో మహారాష్ట్ర పోలీసులు విజేతగా నిలిచారు. 27 అక్టోబర్ 2023న ఎన్పీఏలో ప్రారంభమైన పోటీలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ పోటీల్లో మొదటిస్థానంలో మహారాష్ట్ర, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడోస్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. తెలంగాణకు 12వ స్థానం దక్కింది.