మాడ్రిడ్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ సింధు 24-22, 22-20తో యో జియా మిన్ (సింగపూర్)ను చిత్తు చేసింది.
ఈ ఏడాది సింధు ఓ టోర్నీ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్లో తెలుగమ్మాయి విజృంభించింది. తొలి గేమ్లో సింధు ఒక దశలో 15-20తో వెనుకబడిపోయినా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఏడు మ్యాచ్ పాయింట్లు కాచుకొని ప్రత్యర్థి చేతుల్లో నుంచి గేమ్ను లాగేసుకుంది.