అంటానరివో: మడాగాస్కర్ రాజధాని అంటానరివోలో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మొదలైన ఇండియన్ ఓషియన్ ఐస్ల్యాండ్ గేమ్స్లో భాగంగా జరిగిన ఫుట్బాల్ స్టేడియంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా 85 మందికి గాయాలయ్యాయి.
పరిమితికి మించి ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తడం ప్రమాదానికి ప్రధాన కారణమైందని ప్రభుత్వ అధికార ప్రతినిధి లాల్టియానా రక్టోన్జఫీ పేర్కొన్నాడు. ఈ ఘటనపై మడాగాస్కర్ ప్రధాని క్రిస్టియన్ నాట్సె సంతాపం వ్యక్తం చేశారు. దవాఖానలో క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని ఆయన పరిశీలించి పరమార్శించారు.