రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు. దీపక్ హుడా (59) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కృనాల్ పాండ్య (25) కాసేపు ఆడినా భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆరంభంలోనే క్వింటన్ డీకాక్ (7), ఆయుష్ బదోనీ (0), కేఎల్ రాహుల్ (10) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. అలాంటి సమయంలో హుడా, కృనాల్ ఆ జట్టును ఆదుకున్నారు.
కానీ ఇన్నింగ్స్ వేగం పెంచే క్రమంలో ఇద్దరూ పెవిలియన్ చేరారు. చివర్లో మార్కస్ స్టొయినిస్ (27) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు కానీ.. అతనికి మరో ఎండ్ నుంచి సహకరించే వారే కరువయ్యారు. జేసన్ హోల్డర్ (1), దుష్మంత చమీర్ (0) పరుగులు మాత్రమే చెయ్యగలిగారు. మొహ్సిన్ ఖాన్ (9 నాటౌట్), ఆవేష్ ఖాన్ (1 నాటౌట్) ఇద్దరూ జట్టు ఆలౌట్ కాకుండా అడ్డుకున్నారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది.
విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం నమోదు చేసింది. ఈ విజయంతో రాయల్స్ దాదాపు ప్లే ఆఫ్స్ చేరినట్లే. రాయల్స్ బౌలర్లలో ట్రెంట బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెకాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. చాహల్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.