రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్కు గట్టి షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న క్వింటన్ డీకాక్ (7), ఆయుష్ బదోనీ (0) ఇద్దరూ వరుస బంతుల్లో అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో వీళ్లిద్దరూ పెవిలియన్ చేరారు. బౌల్ట్ వేసిన షార్ట్ బాల్నుడీకాక్ బలంగా బాదాడు. పాయింట్ దిశగా వెళ్లిన బంతిని నీషమ్ అద్భుతంగా అందుకున్నాడు.
దీంతో డీకాక్ మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోనీ.. తను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులతో నిలిచింది.