గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో జట్టు కూడా తడబడుతోంది. 145 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆ జట్టుకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. డీకాక్ (11), రాహుల్ (6) ఇద్దరూ స్వల్పస్కోర్లకే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా ఒంటరిగా పోరాడుతున్నాడు.
కానీ అవతలి ఎండ్ నుంచి హుడాకు సహకారం కరువైంది. కొత్త కుర్రాడు కరణ్ శర్మ (4), కృనాల్ పాండ్యా (5), ఆయుష్ బదోనీ (8) ఎవరూ కాసేపు కూడా క్రీజులో నిలవలేకపోయారు. బదోనీ అవుటైన తర్వాత వచ్చిన స్టొయినిస్ (2)పై భారీగా అంచనాలు పెట్టుకుంటే.. అతను అనవసరమైన పరుగు కోసం ప్రయత్నిస్తూ.. రనౌట్ అయ్యాడు.
కాసేపటికే జేసన్ హోల్డర్ (1) కూడా ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇలా వచ్చిన వాళ్లు వచ్చినట్లే పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో 65 పరగులకే 6 వికెట్లు కోల్పోయిన లక్నో.. తీవ్రమైన కష్టాల్లో పడింది.