లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బ్యాటర్లు చెమటోడ్చారు. బౌలింగ్కు సహకరిస్తున్న వాతావరణంలో ఆరంభం నుంచే గుజరాత్ జట్టు కష్టాలపాలైంది. ఫామ్లో ఉన్న సాహా (5), మంచి టచ్లో కనిపించిన వేడ్ (10) పవర్ప్లే ఓవర్లు కూడా పూర్తికాకుండానే పెవిలియన్ చేరారు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ పాండ్యా (13) కూడా నిరాశపరిచాడు. కాసేపు నిలబడిన మిల్లర్ (26) భారీ షాట్లు ఆడలేకపోయాడు. అయితే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (63 నాటౌట్) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు.
చివర్లో తెవాటియా (22 నాటౌట్) కొంచెం ధాటిగా ఆడటంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో ఆవేష్ ఖాన్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. మొహ్సిన్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో వికెట్ తీసుకున్నారు.