IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ తొలి పోరులో సన్రైజర్స్ హైదరాబాద్(SRH) మరో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్(Ishan Kishan) సూపర్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్కు చెక్ పెట్టిన కమిన్స్ సేన మరోసారి పరుగుల విందుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కాసేపట్లో ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్తో ఆరెంజ్ ఆర్మీ తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో సారథి రిషభ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో.. సన్రైజర్స్ బ్యాటర్లు సొంత ప్రేక్షకుల సమక్షంలో దంచికొట్టేందుకు తహతహలాడుతున్నారు.
సన్రైజర్స్ తుది జట్టు : అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితిశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికెత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
లక్నో తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదొని, శార్ధూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రథీ, ప్రిన్స్ యాదవ్.